బండి కుమారుడి వ్యవహారంపై కవిత ఫైర్..

బండి సంజయ్ కుమారుడి వ్యవహారంపై కవిత ఫైర్..

కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కుమారుడిపై(Son) వచ్చిన ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై స్పందించిన టీఆర్ఎస్ అధినేత్రి కవిత (Kavitha) ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ కుమారుడు దేశం విడిచి పారిపోకుండా వెంటనే లుక్ అవుట్ నోటీసులు (Look Out Notices) జారీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ పారదర్శకంగా జరగాలంటే నిందితుడు దేశం దాటకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అలాగే కుటుంబ సభ్యులపై తీవ్రమైన ఆరోపణలు ఉన్న సమయంలో ప్రధాని మోదీ (Modi), సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాల్గొన్న వేదికను బండి సంజయ్ పంచుకోవడం సరికాదని విమర్శించారు. పెద్దల పిల్లలు తప్పు చేసినా వ్యవస్థ చూసీచూడనట్లు వ్యవహరిస్తుందనే భావన ప్రజల్లోకి వెళ్తోందని వ్యాఖ్యానించారు.

మరోవైపు బాధితురాలి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై కూడా కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ (BRS) సోషల్ మీడియా కార్యకర్తల అత్యుత్సాహం కారణంగానే ఆ ఫోటోలు బయటకు వచ్చాయని ఆరోపిస్తూ, వాటిని పోస్ట్ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధితురాలు మైనర్ కావడంతో మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సమాజం మగపిల్లలను సులభంగా క్షమిస్తుందని, కానీ ఆడపిల్లల జీవితాలపై మాత్రం తీవ్ర ప్రభావం పడుతుందని వ్యాఖ్యానించారు. బాధితురాలి గౌరవం, భవిష్యత్తు దెబ్బతినకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, తాము ఎప్పుడూ ఆడపిల్లల పక్షాన నిలుస్తామని కవిత స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment