ఏసీ పేలి ముగ్గురు మృతి, కుక్క కూడా..

ఏసీ పేలి ముగ్గురు మృతి, కుక్క కూడా..

హర్యానా (Haryana)లోని ఫరీదాబాద్‌ (Faridabad)లో ఒక విషాద సంఘటన జరిగింది. సోమవారం తెల్లవారుజామున ఒక ఇంట్లో ఏసీ(AC) పేలిపోవడం (Exploded)తో ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యులు, వారి పెంపుడు కుక్క (Pet Dog) మరణించారు. ఈ ఘటన ఫరీదాబాద్‌లోని నాలుగు అంతస్తుల భవనంలో జరిగింది.

ప్రమాదం వివరాలు:

ఈ దుర్ఘటన తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో జరిగింది. మొదటి అంతస్తులో ఉన్న ఏసీ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పేలుడుతో మంటలు చెలరేగి రెండో అంతస్తు వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో సచిన్ కపూర్, అతని భార్య రింకు కపూర్, కుమార్తె సుజన్ కపూర్ నిద్రలోనే మరణించారు. ఊపిరాడకపోవడం వల్ల వీరు మరణించినట్లు తెలుస్తోంది. వారి పెంపుడు కుక్క కూడా ప్రాణాలు కోల్పోయింది.

అదే సమయంలో మరో గదిలో నిద్రిస్తున్న వారి కుమారుడు మాత్రం కిటికీలోంచి దూకి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. అయితే, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. పెద్ద శబ్దం రావడంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగువారు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ భవనంలో నాల్గో అంతస్తులో మరో కుటుంబం నివసిస్తుందని, మూడవ అంతస్తును కపూర్ కార్యాలయంగా ఉపయోగించుకున్నారని స్థానికులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment