శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్చార్జ్ వినుత కోటకు డ్రైవర్ రాయుడు హత్య కేసులో మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు రెండు రోజుల క్రితం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో A3గా ఉన్న వినుత కోట, ఆమె భర్త చంద్రబాబుతో పాటు మరో ముగ్గురు జులై 12న చెన్నై పోలీసులచే అరెస్టయ్యారు. రాయుడును గోడౌన్లో చిత్రహింసలకు గురిచేసి హత్య చేసి, మృతదేహాన్ని చెన్నైలోని కూవం నదిలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో వినుత దంపతులతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసి జూలుకు పంపించారు.
కాగా, ఈ కేసులో వినుత కోటకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.. కోర్టు ఆదేశాల మేరకు, వినుత ప్రతి రోజు ఉదయం 10 గంటలలోపు చెన్నైలోని C3 సెవెన్ వెల్స్ పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని నిబంధన విధించింది. నిన్న, ఈ రోజు ఉదయం ఆమె ఈ నిబంధనను పాటిస్తూ స్టేషన్లో సంతకం చేసినట్లు సమాచారం.
ఈ హత్య కేసు రాజకీయ రీత్యా సంచలనం రేపింది, శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై వినుత ఆరోపణలు చేయడంతో వివాదం మరింత తీవ్రమైంది. రాయుడు తమ వ్యక్తిగత, రాజకీయ సమాచారాన్ని ప్రత్యర్థులకు అందించినట్లు అనుమానంతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే వినుత దంపతులు ఈ ఆరోపణలను ఖండిస్తూ, బొజ్జల సుధీర్ రెడ్డి ఈ హత్య వెనుక ఉన్నారని వాదించారు.








