బౌలర్లు అదరగొట్టినా..సిరీస్ మాత్రం ఇంగ్లాండ్ దే

బౌలర్లు అదరగొట్టినా..సిరీస్ మాత్రం ఇంగ్లాండ్ దే

Summarize with AI

ఇంగ్లాండ్‌ (England)లో టీ20 సిరీస్‌ (T20 Series)ను గెలుచుకుని చరిత్ర సృష్టించే అద్భుత అవకాశాన్ని భారత మహిళా జట్టు (Indian Women’s Team) కోల్పోయింది. ఇరు జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాత్రి లండన్‌ (London’s)లోని కెన్నింగ్టన్ (Kennington) ఓవల్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో, భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి 25 బంతుల్లోనే ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్లు పడగొట్టారు. అయితే, చివరికి భారత జట్టు 5 పరుగుల స్వల్ప తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది.

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: సంచలన పతనం

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు సోఫియా డంక్లీ (75), డేనియల్ వ్యాట్ (66)ల బ్యాటింగ్ తో 137 పరుగుల భారీ భాగస్వామ్యం లభించి తుఫాను ఆరంభాన్ని ఇచ్చింది. అయితే, 16వ ఓవర్ రెండో బంతికి దీప్తి శర్మ సోఫియా (Sophia)ను బౌల్డ్ చేయడంతో వికెట్ల పతనం మొదలైంది. అనూహ్యంగా, ఇంగ్లాండ్ జట్టు కేవలం 25 బంతుల్లోనే 9 వికెట్లు కోల్పోయింది. 17వ ఓవర్‌లో అరుంధతి రెడ్డి అలిస్ కాప్సే (2), డేనియల్ వ్యాట్ (66), అమీ జోన్స్ (0) వికెట్లను పడగొట్టింది. కెప్టెన్ టామీ బ్యూమాంట్ కేవలం 2 పరుగులకే రాధా యాదవ్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. ఆ తర్వాత, 19వ, 20వ ఓవర్లలో వరుసగా శ్రీచరణి పైజ్ స్కోల్‌ఫీల్డ్, ఇస్సీ వాంగ్‌లను పెవిలియన్‌కు పంపింది. చివరి ఓవర్‌లో దీప్తి శర్మ (Deepti Sharma) సోఫీ ఎక్లెస్టోన్‌ను, మంధాన లారెన్ ఫైలర్‌ను అవుట్ చేశారు. చివరికి ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి చెరో 3 వికెట్లు తీశారు.

భారత్ పోరాటం.. కానీ ఓటమి

172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత మహిళా జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు స్మృతి మంధాన (56), షెఫాలీ వర్మ (47)లు 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి శుభారంభాన్ని ఇచ్చారు. అయితే, షెఫాలీ అర్ధ సెంచరీని చేజార్చుకుంది. 3వ స్థానంలో వచ్చిన జేమీ స్మిత్ కేవలం 20 పరుగులు చేయగా, మంధాన అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని 49 బంతుల్లో 56 పరుగులు చేసి అవుట్ అయింది. కెప్టెన్ రిచా ఘోష్ 7 పరుగులు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 23 పరుగులు చేశారు. అమన్‌జోత్ కౌర్ (Amanjot Kaur) 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచినా, జట్టును గెలిపించలేకపోయింది. ఈ ఓటమితో సిరీస్గె (Series)లిచే అవకాశం భారత్ చేతుల్లోంచి జారిపోయింది.

Join WhatsApp

Join Now

Leave a Comment