హైకోర్టు ఆదేశాలున్నా..పెద్దారెడ్డికి అడ్డంకులు..ఎస్పీకి లేఖ

హైకోర్టు ఆదేశాలున్నా..పెద్దారెడ్డికి అడ్డంకులు..ఎస్పీకి లేఖ

Summarize with AI

వైఎస్సార్‌సీపీ (YSRCP) సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy) తాడిపత్రి (Tadipatri)కి వెళ్లేందుకు మరోసారి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో, అనంతపురం ఎస్పీ జగదీష్‌ (SP Jagadeesh)కు ఆయన తాజాగా లేఖ(Letter) రాశారు. ఈసారి పెద్దారెడ్డికి ఎస్పీ అనుమతి ఇస్తారా అనేది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

హైకోర్టు ఆదేశాలు ఉన్నా పోలీసుల నిరాకరణ

‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ (Recalling Chandrababu Manifesto) కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించాల్సి ఉన్నందున, తాను అక్కడికి రావాల్సి ఉందని, అందుకు అనుమతి ఇవ్వాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి తన లేఖలో ఎస్పీని కోరారు. వాస్తవానికి, పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు గత ఏప్రిల్ 30న హైకోర్టు (High Court) అనుమతి ఇచ్చింది. అంతేకాకుండా, పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళినప్పుడు తగిన భద్రత కల్పించాలని పోలీసు శాఖకు హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, అనంతపురం పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలోనే, పెద్దారెడ్డి మరోసారి ఎస్పీకి లేఖ రాశారు.

తాడిపత్రిలో అరెస్ట్, పోలీసుల తీరుపై ఆగ్రహం

ఇటీవలే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోని తన నివాసానికి వెళ్ళగా, పోలీసులు అక్కడికి చేరుకుని బలవంతంగా ఆయన్ను అరెస్ట్ చేశారు. తాడిపత్రిలో ఉండరాదంటూ ఆంక్షలు విధించి, అనంతరం అనంతపురంలోని రాంనగర్‌లో ఉన్న ఆయన నివాసంలో వదిలిపెట్టారు.

పోలీసుల ఈ తీరుపై కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy)కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. “నా ఇంటికి నేను వెళ్తే పోలీసులకు ఇబ్బంది ఏంటి? పోలీసులకు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?” అని ఆయన ప్రశ్నించారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గూండాగిరిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొంటానని పెద్దారెడ్డి స్పష్టం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలను పోలీసులు పట్టించుకోవడం లేదని కూడా ఆయన మండిపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment