నీతులు వర్సెస్ చేతలు.. చంద్రబాబు, పవన్‌పై పేలుతున్న సెటైర్లు

నీతులు వర్సెస్ చేతలు.. చంద్రబాబు, పవన్‌పై పేలుతున్న సెటైర్లు

మ‌హా న్యూస్ ఆఫీస్‌పై దాడి సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), డిప్యూటీ సీఎం (Deputy CM) పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)లపై సోషల్ మీడియా (Social Media)లో విమర్శలు, సెటైర్లు (Satires) వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ(Telangana)లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)(BRS) కార్యకర్తలు మహా న్యూస్ కార్యాలయం (Maha News office)పై దాడి చేసిన ఘటనను ఈ ఇద్ద‌రు నేత‌లూ ఖండించారు, కానీ ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో గత పదిహేను రోజుల క్రితం సాక్షి పత్రికా కార్యాలయం (Sakshi Newspaper Office)పై జరిగిన దాడిపై మౌనం వహించడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.

సాక్షి’పై దాడికి ఖండ‌న ఏదీ..?
ప‌క్క రాష్ట్రంలో ఓ మీడియా ఛాన‌ల్‌పై జ‌రిగిన దాడిని ఖండిస్తూ, ప్రజాస్వామ్యంలో మీడియాపై దాడులకు చోటు లేదు అని వ్యాఖ్యానించిన సీఎం చంద్ర‌బాబు.. తాను ముఖ్య‌మంత్రిగా ఉన్న రాష్ట్రంలో గ‌త ప‌దిహేను రోజుల క్రితం సాక్షి పత్రిక కార్యాల‌యాల‌పై రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడిని ఎందుకు మాట్లాడలేదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ద్వంద్వ వైఖరిపై సోషల్ మీడియాలో విమర్శలు ఊపందుకున్నాయి, “మీకు అనుకూలంగా వ్యవహరించే వారివి మాత్రమే మీడియా ఛానళ్లా?” అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

నా త‌ల్లిని అవ‌మానించార‌న్న ప‌వ‌న్‌..
పవన్ కళ్యాణ్ కూడా గతంలో మహా న్యూస్ ఛానల్‌పై తీవ్ర విమర్శలతో కూడిన ట్వీట్ చేశార‌ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. పవన్ ట్వీట్ చేస్తూ “ఎంపీ సుజనా చౌదరి, ఆయన బినామీలు నిధులు సమకూర్చిన మహా న్యూస్, నా తల్లిని కించపరిచే అసభ్యకర కార్యక్రమాలు ప్రసారం చేసింది. దీనికి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని హెచ్చరించారు. అయితే, ఇప్పుడు అదే ఛానల్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ పవన్ ట్వీట్ చేయడం నెటిజన్లలో అనుమానాలను రేకెత్తిస్తోంది. “తల్లిని కించపరిచిన ఛానల్‌పై ఇప్పుడు ప్రేమ ఎలా వచ్చింది?” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మహిళలపై అఘాయిత్యాలపై పవన్ మౌనం వహించడం, మ‌హా టీవీపై దాడిని ఖండించ‌డం కూడా విమర్శలకు దారితీస్తోంది.

డీసీపై దాడిని ఎందుకు ఖండించ‌లేద‌ని ప్ర‌శ్న‌
అదే విధంగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన వార్తను ప్రచురించినందుకు డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మద్దతుదారులు దాడి చేసిన ఘటనను కూడా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఈ దాడిని చంద్రబాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు ఖండించ‌లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. “ఛానల్ మీకు అనుకూలమైతే నీతులు చెబుతారా..? వాస్తవాలను ప్రచారం చేసే వాటిపై దాడులు జ‌రిగితే మౌనం వ‌హిస్తారా..? ఇదెక్క‌డి ద్వంద్వ వైఖ‌రి అని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు, నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మ‌హా టీవీపై దాడి ఘ‌ట‌న‌ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల ద్వంద్వ వైఖరిని బ‌య‌ట‌పెట్టింద‌న్న ఆరోప‌ణ‌లు తీవ్రమ‌య్యాయి. దీనిపై సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment