న‌కిలీ ప‌త్రాల‌తో రూ.920 కోట్లు.. భారీ స్కామ్ బ‌ట్ట‌బ‌య‌లు!

న‌కిలీ ప‌త్రాల‌తో రూ.920 కోట్లు.. భారీ స్కామ్ బ‌ట్ట‌బ‌య‌లు

కళ్యాణదుర్గం (Kalyanadurgam)లో భారీ స్కామ్ (Massive Scam) బ‌య‌ట‌ప‌డింది. రూ.920 కోట్ల స్టాంప్ డ్యూటీ (Stamp Duty) కుంభకోణం (Scandal) ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) సంచలనం సృష్టిస్తోంది. ఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్ సంస్థ (SR Constructions Firm) ద్వారా జ‌రిగిన ఈ భారీ కుంభ‌కోణంలో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA) అమిలినేని సురేంద్ర బాబు (Amilineni Surendra Babu) ప్రమేయం ఉన్న‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. నకిలీ ఈ-స్టాంప్ పత్రాలు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ల (Fabricated Documents)తో యూనియన్ బ్యాంక్ (Union Bank) నుంచి రూ.900 కోట్లు, టాటా క్యాపిటల్స్ (Tata Capitals) నుంచి రూ.20 కోట్ల రుణాలు పొందినట్లు ఆరోపణలు వెల్లడయ్యాయి. ఈ కుంభకోణంలో ఎమ్మెల్యే అనుచరుడు ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు (Errappa Alias MeeSeva Babu) కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటపడటంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)(RBI), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విచారణ ప్రారంభించాయి. ఈ విషయం ఆంధ్ర‌రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

టీడీపీ ఎమ్మెల్యే అలిమినేని సురేంద్ర‌బాబు ప్ర‌ధాన అనుచ‌రుడిగా గుర్తింపు పొందిన ఎర్ర‌ప్ప అలియాస్ మీసేవ బాబు నకిలీ ఈ-స్టాంప్ పత్రాలు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లతో త‌న ఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ద్వారా భారీగా రుణం పొందిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ-స్టాంప్ డ్యూటీ చెల్లింపుల్లో 0.5 శాతం చెల్లించాల్సిన మొత్తాన్ని స్వల్పంగా చూపించి, నకిలీ డాక్యుమెంట్ల (Fake Stamps)ను రూపొందించినట్లు వెల్లడైంది. మీసేవ బాబు జనరేట్ చేసిన ఈ డాక్యుమెంట్లలో స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని ఫ్యాబ్రికేట్ చేసి, నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని తక్కువగా ఎంటర్ చేసి, మరో ప్రింట్ తీసి బ్యాంకులకు సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ తప్పుడు పత్రాలతో ఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్ సంస్థ యూనియన్ బ్యాంక్‌ను మోసం చేసి రూ.900 కోట్ల రుణం, టాటా క్యాపిటల్స్ నుంచి రూ.20 కోట్ల రుణం పొందింది. ఈ విధంగా స్టాంప్ డ్యూటీ చెల్లింపులో కుంభకోణానికి పాల్పడి, బ్యాంకులను, ఆర్బీఐని తప్పుదోవ పట్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు మీసేవ బాబును అదుపులోకి తీసుకొని, రహస్యంగా విచారిస్తున్నారు.

విషయం బయటపడటంతో ఎమ్మెల్యే సురేంద్ర బాబుకు చెందినట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్న‌ ఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్ సంస్థ తామే మోసపోయామని వాదిస్తూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, ఈ ఫిర్యాదు కుంభకోణంలోని ఆరోపణలను తప్పించుకునే ప్రయత్నంగా భావిస్తున్నారు. పోలీసులు మీసేవ బాబు సహా ముగ్గురిపై కేసు నమోదు చేసి, విచారణను ముమ్మరం చేశారు. నకిలీ స్టాంపులు, చలానాలతో కోట్ల రూపాయల విలువైన మోసాలు జరిగినట్లు ఆరోపణలు ఉండటంతో, ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో స్టాంప్ డ్యూటీ కుంభకోణాలు జరిగిన నేపథ్యంలో, ఈ కేసు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ స్కాం కళ్యాణదుర్గం టీడీపీ నాయకత్వంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు, రూ.189 కోట్ల ఆస్తులు కలిగిన వ్యాపారవేత్తగా, తన ఎస్ఆర్‌సీ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా రోడ్లు, సాగునీటి ప్రాజెక్టులు చేపట్టినట్లు తన ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే, ఈ కుంభకోణంతో ఆయన వ్యాపార, రాజకీయ కార్యకలాపాలపై అనుమానాలు ఏర్పడ్డాయి. టీడీపీ నాయకత్వం ఈ ఆరోపణలపై ఇంతవరకు స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడం, విపక్షాలు ఈ విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది, ముఖ్యంగా బ్యాంకు మోసాలు, నకిలీ పత్రాలపై ఆర్బీఐ విచారణ ఫలితాలు కీలకంగా మారనున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment