ఇదేనా మీ మ‌హిళా ర‌క్ష‌ణ‌..? – కుప్పం ఘ‌ట‌న‌పై వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

ఇదేనా మీ మ‌హిళా ర‌క్ష‌ణ‌..? - కుప్పం ఘ‌ట‌న‌పై వైఎస్ జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు

ఏపీ (AP) సీఎం (CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సొంత నియోజకవర్గమైన (Own Constituency) కుప్పం (Kuppam)లో మహిళ (Woman)ను చెట్టు (Tree)కు కట్టేసి హింసించిన దారుణ ఘటన దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. దేశ ప్ర‌జ‌లంతా ఈ ఘ‌ట‌న‌ను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌ల‌పై (Law And Order) ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తారు. ఈ ఘ‌ట‌న‌పై వైసీపీ అధినేత‌ (YSRCP Chief), మాజీ ముఖ్య‌మంత్రి (Former Chief Minister) వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఏపీ (AP)లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిదర్శనమని, చంద్రబాబు (Chandrababu) పాలనలో మహిళలకు రక్షణ, ఆత్మగౌరవం లభించడం లేదని ఆయన ఆరోపించారు. త‌న ఎక్స్ ఖాతా ద్వారా ఈ ఘటనపై స్పందించిన జగన్, రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

చిత్తూరు జిల్లా (Chittoor District) కుప్పం (Kuppam) మండలం నారాయణపురం (Narayana Puram) గ్రామంలో జరిగిన ఈ ఘటనలో, తిమ్మరాయప్ప (Timmarayappa) అనే కూలి తీసుకున్న రూ.80,000 అప్పును చెల్లించలేకపోవడంతో అతని భార్య(Wife) శిరీష (Sirisha)ను టీడీపీ కార్య‌క‌ర్త (TDP Worker) చెట్టుకు కట్టేసి హింసించాడని జగన్ మండిప‌డ్డారు. శిరీష పిల్లలు రోదిస్తున్నప్పటికీ ఆమెపై కనికరం చూపకుండా చిత్రహింసలు పెట్టిన ఈ ఘటన సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసిందని ఆయన పేర్కొన్నారు.

“చంద్రబాబు గారూ, రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా?” అని జగన్ ప్రశ్నించారు. ఈ ఘటన చంద్రబాబు దుర్మార్గపు పరిపాలన ఫలితమని, రాష్ట్రంలో టీడీపీ నాయకులు ‘రెడ్‌బుక్’ పేరిట చెలరేగిపోతూ మహిళలు, యువతులు, బాలికలపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

రాష్ట్రంలో మహిళల భద్రతపై చర్చ తీవ్రమవుతున్న నేపథ్యంలో, ఈ ఘటన రాజకీయంగా కూడా ప్రభుత్వానికి సవాలుగా మారింది. సోషల్ మీడియాలో #SaveWomenInAP, #CBNSadistRule వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రజలు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని, ఆడ‌వారి ర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త క‌ల్పించాల‌ని డిమాండ్లు వ్య‌క్తం అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment