బాలీవుడ్ ప్రముఖ నటి కత్రీనా కైఫ్ (Katrina Kaif)కు మాల్దీవ్స్ ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. మాల్దీవ్స్ మార్కెటింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కార్పొరేషన్ ఆమెను తమ గ్లోబల్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ (Global Tourism Brand Ambassador)గా నియమించింది. ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కత్రీనా కైఫ్దే ప్రత్యేక స్థానం. అలాంటి ప్రముఖ వ్యక్తిని తమ దేశానికి పర్యాటక ప్రచారకర్తగా ఎంపిక చేయడం గర్వకారణమని మాల్దీవ్స్ అధికారులు తెలిపారు. ఆమె అంతర్జాతీయ గుర్తింపు మాల్దీవ్స్ టూరిజాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రచారం చేయడంలో ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉండగా, వచ్చే నెలలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మాల్దీవ్స్ (Maldives) పర్యటనకు వెళ్లనున్నారని సమాచారం. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.