తెలంగాణ సర్కార్ (Telangana Government) ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై నెలలో రెండుసార్లు మంత్రివర్గ సమావేశాలు (Cabinet Meetings) నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) నిర్ణయించారు.
విధానపరమైన నిర్ణయాల్లో ఆలస్యం జరగకుండా, పాలనలో వేగవంతమైన పురోగతి సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు లేదా మూడు నెలలకోసారి (Once In Two or Three Months) కాకుండా, రెగ్యులర్గా కేబినెట్ సమావేశాలు (Cabinet Meetings) జరపడం ద్వారా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై క్షేత్రస్థాయిలో సమీక్షలు నిర్వహించనున్నారు.
మంత్రులతో నిరంతరం చర్చలు జరిపేందుకు వీలుగా, ప్రతి రెండు వారాలకోసారి కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి నెల మొదటి, మూడో శనివారాల్లో ఈ సమావేశాలు జరిగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 17 కేబినెట్ సమావేశాలు జరిగాయి. ఈ కొత్త నిర్ణయంతో పాలనలో మరింత పారదర్శకత, సమర్థత సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.