టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కు చెందిన వన్ కమ్యూన్ పబ్ (One Commune Pub), రెస్టారెంట్పై బెంగళూరు (Bangalore) పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్ మేనేజ్మెంట్ COPTA చట్టం (Cigarettes and Other Tobacco Products Act)ను ఉల్లంఘించినట్లు పేర్కొంది. ఈ చట్టం ప్రకారం, హోటల్స్ (Hotels), పబ్లు (Pubs), విమానాశ్రయాలు (Airports) వంటి ప్రదేశాల్లో తప్పనిసరిగా ప్రత్యేక స్మోకింగ్ జోన్లు (Smoking Zones) ఏర్పాటు చేయాలి. అయితే కోహ్లీకి చెందిన ఈ పబ్లో అలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో, చట్టవ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణలపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.
గతంలోనూ నిబంధనల ఉల్లంఘన
ఇది మొదటిసారి కాదు. గతేడాది కూడా ఇదే పబ్ నిబంధనలను ఉల్లంఘించి, అనుమతించిన సమయానికి మించి తెరిచి ఉంచినందుకు కేసు (Case) నమోదైంది. అప్పట్లోనూ దీనిపై నగర మునిసిపల్ అధికారులు (BBMP) చట్టపరంగా చర్యలు తీసుకున్నారు.
అధికారుల హెచ్చరికలు
స్మోకింగ్ సంబంధిత చట్టాలను ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజారోగ్యంపై ఈ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని, అన్ని కమర్షియల్ సంస్థలు స్మోకింగ్ నిబంధనలను పాటించాలని హెచ్చరించారు. ఈ కేసు ప్రాధాన్యత దృష్ట్యా, విరాట్ కోహ్లీ పబ్ నిర్వహణ పై మరిన్ని వివరాలు వెలుగు చూసే అవకాశం ఉందంటున్నారు పోలీసులు.