విశాఖపట్నం (Visakhapatnam) లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం (Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Temple) లో చందనోత్సవ (Chandanotsavam) సందర్భంగా జరిగిన విషాద ఘటనపై ప్రజలలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. అప్పన్న స్వామి దర్శనానికి వచ్చిన భక్తుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతిచెందడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఒకే కుటుంబానికి పిల్లా మహేశ్ (Pilla Mahesh), శైలజ (Shailaja), వెంకటరత్నం (Venkataratnam), మహాలక్ష్మి (Mahalakshmi) ఉన్నారు. మహేశ్-శైలజ దంపతులు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.
అప్పన్న ఆలయంలో గోడ కూలి మృతిచెందిన వారిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి ఎడ్ల వెంకట్రావు (48), అంబాజీపేట వాసి పత్తి దుర్గాస్వామి నాయుడు (32), కుమ్మపట్ల నివాసితుడు మణికంఠ (28)తో పాటు మరొకరు కూడా ఈ ఘటనలో మరణించారు. ఈ ప్రమాదంపై సమగ్రంగా విచారణ జరిపేందుకు ప్రభుత్వం మూడు మందితో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దాదాపు భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్లు, వైద్యం అందుబాటులో లేకపోవడం వంటి అంశాలపై ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది.
గోడ నిర్మించి 20 రోజులే..
అప్పన్న ఆలయంలో గోడ చందనోత్సవం కోసమే 20 రోజుల క్రితమే నిర్మించారని మంత్రులు, అధికారులు ప్రకటిస్తున్నారు. అప్పన్న నిజరూప దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారని తెలిసి కూడా ప్రభుత్వం, అధికారులు ఇలాంటి నాసిరకం గోడను నిర్మించి, భక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడడం ఎంత వరకు ధర్మం అని మరణించిన వారి కుటుంబాలు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవానికి సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా భక్తులను బలితీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.