రిమోట్ కంట్రోల్ బాంబ్‌.. ప‌దిమంది పాక్‌ జ‌వాన్లు మృతి

రిమోట్ కంట్రోల్ బాంబ్‌.. ప‌దిమంది పాక్‌ జ‌వాన్లు మృతి

భారత్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్తాన్‌కి మరోసారి షాక్ తగిలింది. బలూచిస్తాన్‌లోని క్వెట్టాలో జరిగిన తీవ్రవాద దాడిలో పాక్ సైన్యానికి భారీ నష్టం వాటిల్లింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) నిర్వహించిన ఈ దాడిలో 10 మంది పాక్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మార్గట్ ప్రాంతంలో రోడ్డుకొరక రిమోట్ కంట్రోల్‌తో అమర్చిన బాంబును పేల్చిన BLA, దాడి సందర్భంగా తీసిన వీడియోను కూడా విడుదల చేసింది. ఈ ఘటన మరోసారి ఆ ప్రాంతంలో భద్రతా లోపాల్ని బయటపడేసింది. ఇప్పటికే మార్చిలో జరిగిన BLA దాడుల్లో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పాక్ నుంచి స్వాతంత్ర్యం కోరుతూ BLA తమ పోరాటాన్ని కొనసాగిస్తోంది.

బలూచ్ విముక్తి సైన్యం గత కొంత కాలంగా పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తూ, ప్రాంతంలో స్వాతంత్య్రం కోసం పోరాడుతోంది. ఈ దాడులు పాకిస్తాన్ భద్రతా దళాలకు పెను సవాలుగా మారాయి. పాకిస్తాన్ సైన్యం ఈ దాడిపై ఇంతవరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే, ఈ ఘటన పాక్ సైన్యంపై ఒత్తిడిని మరింత పెంచిందని, దేశంలోని ఆర్థిక సంక్షోభం, ఇతర తీవ్రవాద సంస్థల దాడులతో కలిసి పాకిస్తాన్‌ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ దాడి నేపథ్యంలో బలూచిస్తాన్‌లో భద్రతా ఏర్పాట్లను పాక్ సైన్యం మరింత కట్టడి చేసే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment