టీడీపీ సెంట్ర‌ల్ ఆఫీసులో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. వీడియో వైర‌ల్‌

టీడీపీ సెంట్ర‌ల్ ఆఫీసులో వ్య‌క్తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం.. వీడియో వైర‌ల్‌

మంగ‌ళ‌గిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సంచ‌ల‌న ఘ‌ట‌న చోటుచేసుకుంది. టీడీపీ ఆఫీస్‌లోని స్వ‌ర్గీయ ఎన్టీఆర్ విగ్ర‌హం ముందు ఓ వ్య‌క్తి సూసైడ్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నించిన ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపింది. టీడీపీ సెంట్ర‌ల్ ఆఫీస్‌లో ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

సోమ‌వారం ఉద‌యం దెందులూరు ప్రాంతానికి చెందిన దాస‌రి బాబురావు అనే వ్య‌క్తి త‌న భార్య దాస‌రి నాగ‌ల‌క్ష్మితో క‌లిసి మంగ‌ళ‌గిరిలోని టీడీపీ సెంట్ర‌ల్ ఆఫీస్‌కు వచ్చాడు. దెందులూరులో మ‌ట్టి మాఫియా వేధింపులు భ‌రించ‌లేక టీడీపీ ఆఫీస్‌లో ఎన్డీఆర్ విగ్ర‌హం వ‌ద్ద బ్లేడుతో త‌న ఎడ‌మ చేతి మ‌ణిక‌ట్టు కోసుకొని సూసైడ్‌కు ప్ర‌య‌త్నించాడు. దాస‌రి బాబు చేతి నుంచి ర‌క్త‌స్రావం అవుతుండ‌టాన్ని అక్క‌డున్న‌వారు గ‌మ‌నించి అత‌న్ని కాపాడే ప్ర‌య‌త్నం చేశారు. ర‌క్త‌స్రావం తీవ్ర‌మ‌వ్వ‌డంతో అత‌న్ని ద‌గ్గ‌ర‌లో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

టీడీపీ ఎమ్మెల్యే అనుచ‌రుల మ‌ట్టి మాఫియా..
దెందులూరులో టీడీపీ నేత‌ల మ‌ట్టి మాఫియాను అడ్డుకున్నందుకు త‌మ‌ను బెదిరించి, దాడికి పాల్ప‌డ్డార‌ని దాస‌రి బాబురావు భార్య దాస‌రి నాగ‌ల‌క్ష్మి క‌న్నీరుపెట్టుకున్నారు. త‌మ‌కున్న పొలం నుంచి మ‌ట్టిని ఇష్టారీతిగా తోడుకుంటున్నార‌ని, ఏంట‌ని వారిని ప్ర‌శ్నిస్తే ఎమ్మెల్యే మ‌నుషుల‌మంటూ బెదిరింపుల‌కు దిగుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌ట్టి తోడుకోవ‌డానికి ఎమ్మెల్యే లారీలు, మెషీన్ వ‌చ్చేస్తాయి.. లేదంటే రూ.2 కోట్లు ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నార‌ని భావోద్వేగానికి గుర‌య్యారు. త‌మ భూమిలో మ‌ట్టిని తోడేస్తూ త‌మ‌పైనే దాడికి పాల్ప‌డ్డార‌న్నారు. దెందులూరులో ఎమ్మెల్యే మనుషుల మ‌ట్టి మాఫియాపై ఫిర్యాదు చేసేందుకు టీడీపీకు వెళ్లామ‌ని, అంత‌లో త‌న‌కు క‌లిగిన‌ బాధ‌ను భ‌రించ‌లేక త‌న భ‌ర్త బాబురావు ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించాడ‌ని నాగ‌ల‌క్ష్మి క‌న్నీరుపెట్టుకుంటూ మీడియాకు వివ‌రించారు.

దెందులూరులో టీడీపీ ఎమ్మెల్యే అనుచ‌రుల మ‌ట్టి మాఫియా ఏ లెవెల్‌లో జ‌రుగుతుందో ఈ ఘ‌ట‌న అద్దం ప‌డుతోంద‌ని, బాధిత కుటుంబానికి త‌గిన న్యాయం చేయాల‌ని ప‌లువురు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ ఆఫీస్‌లో ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన బాబురావు ఆరోగ్యం ప్ర‌స్తుతం స్థిరంగా ఉన్న‌ట్లుగా స‌మాచారం. ఈ ఘటన టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది. మట్టి మాఫియాల బారిన పడ్డ బాధితుల పట్ల ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని బాబురావు కుటుంబసభ్యులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment