దేశీ ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank) 2025 జనవరి-మార్చి త్రైమాసికానికి గాను రూ.13,502 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 15.7 శాతం పెరుగుదల. ఈ త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం (NII) కూడా గణణీయంగా (Significantly) పెరిగింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 11 శాతం పెరిగి రూ.21,193 కోట్లకు చేరింది. అలాగే వడ్డీయేతర ఆదాయం 18.4 శాతం పెరిగి రూ.7,021 కోట్లకు చేరినట్లు బ్యాంక్ వెల్లడించింది.
షేర్హోల్డర్లకు గుడ్ న్యూస్..
గత ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతి షేరుకు రూ.11 చొప్పున డివిడెండ్ (Dividend) చెల్లించాలని బ్యాంక్ నిర్ణయించింది. ఇది పెట్టుబడిదారులకు ఆనందకరమైన విషయం. గురువారం ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు బీఎస్ఈలో 3.7 శాతం లాభంతో రూ.1406.65 వద్ద ముగిశాయి.