తెలంగాణ (Telangana) లో రాజకీయ వేడి రాజుకుంటోంది. త్వరలో భారీ కుంభకోణాన్ని బయటపెడతానని ప్రకటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).. ఎట్టకేలకు ఆ బాంబ్ (Bomb) పేల్చారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం (CM-Revanth Reddy Government)పై తీవ్ర ఆరోపణలు చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) పరిధిలోని 400 ఎకరాల అటవీ భూమిని తాకట్టు పెట్టి, తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్డస్ట్రియల్ కార్పొరేషన్ (TGIIC) పేరుతో రూ.10వేల కోట్ల రుణం (Loan) తీసుకున్నారని ఆరోపించారు.
ఇది ఓ పెద్ద స్కాం (Big scam) అని, ఇందులో ఓ బీజేపీ ఎంపీ (BJP-MP) సైతం భాగస్వామి అని కేటీఆర్ ఆరోపించారు. “ఆ ఎంపీ పేరు త్వరలో వెల్లడిస్తాను. ఇప్పటికే ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ (Trust Investment Advisor) అనే ప్రైవేట్ కంపెనీకి రూ.170 కోట్లు లంచం (Bribe)గా ఇచ్చారు. ఈ స్కాం గురించి త్వరలో కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం” అని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది. అధికార పక్షం దీనిపై ఎలా స్పందించనుందో వేచి చూడాల్సిందే.