ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు (Untimely Rains) రైతులను తీవ్రంగా వెంటాడుతున్నాయి. వరుస వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు కలసి పంటలకు (Crops) భారీ నష్టాన్ని (Heavy Damage) మిగిల్చాయి. కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల, బాపట్ల, ప్రకాశం, అల్లూరి జిల్లాల్లో నష్టం అత్యధికంగా నమోదైంది. అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం, దాదాపు 10 వేల ఎకరాల్లో వరి, 3 వేల ఎకరాల్లో మొక్కజొన్న, అలాగే 670 ఎకరాల్లో అరటి, బొప్పాయి, నిమ్మ వంటి ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
వర్షాలతో పాటు ఈదురుగాలులు పంటలను నేలమట్టం చేశాయని, నష్ట తీవ్రత మరింత పెరుగుతోందని వ్యవసాయ శాఖ (Agriculture Department) అధికారులు తెలిపారు. ఇప్పటికే పెట్టుబడులతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇది మరో భారీ దెబ్బగా మారింది. ప్రభుత్వం తక్షణమే పరిహార చర్యలు చేపట్టాలని రైతులు (Farmers) డిమాండ్ చేస్తున్నారు.