రూ.15వేల జీతానికి రూ.34 కోట్ల పన్ను.. పారిశుద్ధ్య కార్మికుడు షాక్‌

రూ.15వేల జీతానికి రూ.34 కోట్ల పన్ను.. పారిశుద్ధ్య కార్మికుడు షాక్‌

పారిశుద్ధ్య కార్మికుడి (Sanitation Worker) కి ఇన్‌కం ట్యాక్స్ (Income Tax) అధికారులు భారీ షాక్ ఇచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా (Agra) కు చెందిన పారిశుద్ధ్య కార్మికుడు కరణ్‌కుమార్ (Karan Kumar) నెల జీతం రూ.15 వేలు (Rs. 15,000) మాత్రమే. అయితే అకస్మాత్తుగా అతనికి ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ.34 కోట్ల (Rs. 34 crore) పన్ను నోటీసు (Tax Notice) రావడంతో తలపట్టుకుని కూర్చున్నాడు. తన జీతానికి, క‌ట్టాల్సిన ప‌న్నుకు పొంత‌లేక‌పోవ‌డంతో అవాక్క‌య్యాడు. ఈ షాక్‌లోనే అతడు పోలీసులను ఆశ్రయించాడు.

పాన్ కార్డ్ మోసమా?
కరణ్‌కుమార్‌కు అందిన నోటీసుల్లో 2019-2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.34 కోట్ల ఆదాయం వచ్చినట్లు పేర్కొన్నారు. అయితే తాను కేవలం పారిశుద్ధ్య కార్మికుడినేనని, ఇంత భారీ మొత్తంలో ఆదాయం తనకు రాలేదని కరణ్ తేల్చి చెప్పాడు. తన పాన్‌ కార్డ్ వివరాలను ఎవరైనా దుర్వినియోగం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. గతంలో తన యజమానికి పాన్ కార్డ్ (PAN Card), గుర్తింపు పత్రాలు (Identity Documents) ఇచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

ఇటీవల అలీగఢ్‌లో జ్యూస్ వ్యాపారికి కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది. రూ.7.5 కోట్లు చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ అతనికి నోటీసు పంపింది. ఈ ఘటనలు పాన్ కార్డ్ మోసాలపై పెద్ద ఎత్తున అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment