2025లో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అట్టహాసంగా జరిగింది. 2023 సంవత్సరానికి గాను ఉత్తమ ప్రతిభ కనబరిచిన చిత్రాలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు. ఈ వేడుకలో దక్షిణాది, ఉత్తరాది సినీ పరిశ్రమలకు చెందిన విజేతలు సందడి చేశారు.
అవార్డు విజేతలు వీరే:
ఉత్తమ చిత్రం: ’12th ఫెయిల్’ (హిందీ)
ఉత్తమ నటుడు: షారుఖ్ ఖాన్ (‘జవాన్’ చిత్రానికి), విక్రాంత్ మసీహ్ (’12th ఫెయిల్’ చిత్రానికి)
ఉత్తమ నటి: రాణి ముఖర్జీ
ఉత్తమ తెలుగు చిత్రం: ‘భగవంత్ కేసరి’ (నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం)
ఉత్తమ బాలనటి: సుకృతి వేణి (సుకుమార్ కుమార్తె, ‘గాంధీతాత చెట్టు’ చిత్రానికి)
ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: ‘హనుమాన్’ చిత్రం (యానిమేషన్, గేమింగ్ అండ్ కామిక్ విభాగంలో)
ఉత్తమ సాహిత్యం: ‘బలగం’ సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాటకు
ఉత్తమ స్క్రీన్ప్లే: ‘బేబీ’ చిత్రం
ఉత్తమ పురుష నేపథ్య గాయకుడు: రోహిత్







