మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. 37 మంది లొంగుబాటు

ఆప‌రేష‌న్ క‌గార్ (Operation Kagar) పేరుతో కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇటీవల చేపట్టిన విస్తృత చర్యలు మావోయిస్టులపై (Maoists) భారీ ప్రభావం చూపుతున్నాయి. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు మావోయిస్టులను వెంబడించడంతో పలు ప్రాంతాల్లో రెడ్‌ రెబల్స్‌ వెనక్కు తగ్గుతున్నారు. ఇప్పటికే హిడ్మా (Hidma) సహా పలువురు ప్రముఖ నాయకులు హతమవడం, అనేకమంది అడవుల నుంచి బయటకొచ్చి లొంగిపోవడం నేపథ్యంలో మావోయిస్టు శక్తి బలహీనమవుతోంది.

ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీకే మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ (Telangana DGP) ముందుకు 37 మంది మావోయిస్టులు (37 Maoists) లొంగిపోయారు (Surrendered). వీరిలో 25 మంది మహిళా మావోయిస్టులు ఉండటం ప్రత్యేకంగా గమనార్హం. లొంగిపోయిన వారిలో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ సభ్యుడు సమ్మయ్య అలియాస్ ఆజాద్ (Sammayya alias Azad) కూడా ఉన్నాడు. ఏవోబీ ప్రాంతంలో పార్టీ నిర్మాణం, సభ్యుల నియామకం, ఆయుధ సరఫరాల్లో ఆజాద్‌ కీలక పాత్ర పోషించినట్టు సమాచారం.

ఈ లొంగుబాటు సందర్భంగా భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. 303 రైఫిల్స్‌, జీ-3 రైఫిల్స్‌, ఏకే-47లు, ఎస్‌ఎల్‌ఆర్‌, అదనంగా వందల సంఖ్యలో బుల్లెట్లు, క్యాట్రిడ్జ్‌లు స్వాధీనం కావడం మావోయిస్టు నెట్‌వర్క్‌పై భారీ దెబ్బగా భావిస్తున్నారు. ఆపరేషన్ కగార్ మరింత వేగం పుంజుకున్న నేపథ్యంలో వచ్చే రోజుల్లో మరో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment