వైభవ్ సూర్యవంశీ సునామీ.. 35 బంతుల్లో సెంచ‌రీ

14-year-old Vaibhav Suryavanshi smashes 35-ball hundred, breaks world record.

ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) యువతార వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) చరిత్ర సృష్టించాడు. కేవలం 35 బంతుల్లోనే సెంచ‌రీ (Century) చేసి స్టేడియంలో ప‌రుగుల సునామీ (Run Tsunami) సృష్టించాడు. భారత ఆటగాళ్లలో అత్యంత వేగవంతమైన సెంచరీ కొట్టిన ఆటగాడిగా రికార్డ్ నెల‌కొల్పాడు. కేవలం 17 బంతుల్లోనే అర్ధ శతకం బాది ఈ సీజన్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆట‌గాడిగానూ నిలిచాడు. 14 ఏళ్ల యువ‌కిషోరం 35 బంతుల్లో సెంచ‌రీ పూర్తి చేయ‌డం క్రికెట‌ర్లను సైతం ఆశ్చ‌ర్యంలో ముంచెత్తింది.

కేవలం 14 ఏళ్ల వయసులోనే ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వైభవ్ సూర్యవంశీ, టీ20లతో పాటు ఐపీఎల్‌లోనూ నూతన రికార్డులు నమోదు చేశాడు. అతని ప్రతిభ అద్భుతంగా ఉండటమే కాకుండా, క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారింది. ఐపీఎల్లో పిన్న వయసులో సెంచరీ: అత్యల్ప వయసులో ఐపీఎల్‌లో శతకం సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఒకే ఇన్నింగ్సులో 11 సిక్సర్లు బాదటంతో, మురళీ విజయ్ (CSK) రికార్డును సమం చేశాడు.

ప్రతి షాట్‌లో తనదైన శైలి, ధైర్యాన్ని ప్రదర్శించిన వైభవ్, టీ20 క్రికెట్‌లో మరో సెన్సేషన్‌గా మాశాడు. ఈ ప్రదర్శనతో అతనిపై అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై విధ్వంసం సృష్టించిన వైభవ్, సిరాజ్, ఇషాంత్ శర్మ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లను కూడా వణికించాడు. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్‌ (Player of the Match) అవార్డు గెలుచుకున్న ఘనత కూడా వైభవ్ ఖాతాలో చేరింది.

Join WhatsApp

Join Now

Leave a Comment