ముంబై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో టీమిండియా 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్లో అభిషేక్ 54 బంతుల్లో 135 స్కోర్ చేశాడు. 7 ఫోర్లు, 13 సిక్సర్లతో విధ్వంసకరంగా ఆడి శతకం సాధించాడు. 17 బంతుల్లో హాఫ్ సెంచరీ, 37 బంతుల్లో సెంచరీ సాధించాడు.
యువరాజ్ సింగ్ ఏమన్నాడంటే?
అభిషేక్ శర్మ ఆటతీరు చూసి భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్(Yuvraj Singh) ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అతనిపై ప్రశంసల వర్షం కురిపించిన యువీ, “చాలా బాగా ఆడావు అభిషేక్! నిన్ను ఈ స్థాయిలో చూడాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. ఈ రోజు నిన్ను చూసి గర్వంగా ఉంది” అంటూ ట్వీట్ చేశాడు. యువరాజ్ మాటలు అభిషేక్కు మరింత ప్రోత్సాహాన్ని అందించాయని క్రికెట్ అభిమానులు అంటున్నారు.