ఉత్తరాంధ్రలోని ఉద్దానం (Uddanam) ప్రాంతం అంటే కేవలం ఒక పేరు కాదు. ఆ ప్రాంత ప్రజలు పడే వేదన, వ్యాధి, నిరాశతో నిండిన ప్రదేశంగా దశాబ్దాలుగా గుర్తించబడింది. మూడు పదుల వయస్సు కూడా దాటకముందే కిడ్నీ వ్యాధి (Kidney Disease)తో మంచానికే పరిమితమై.. వర్ణించలేని అవస్థలుపడేవారు. భూగర్భ జలాల్లోని సిలికా, ఫ్లోరైడ్, హెవీ మెటల్స్ కారణంగా వేలాది కుటుంబాలు కిడ్నీ వ్యాధులతో బాధపడి తమ ప్రాణాలు కోల్పోయాయి. ప్రతి ఇంట్లో ఒకరు కిడ్నీ సమస్యతో బాధపడే స్థితి ఏర్పడటంతో, ఉద్దానం పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చి వెళ్లినా, శాశ్వత పరిష్కారం మాత్రం కంటికి కనిపించలేదు.
రూ.700 కోట్లతో సురక్షిత తాగునీరు
అయితే, వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) తన పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి.. ఉద్దానంలోని దీనావస్థను కనుమరుగు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మెల్లగా, స్పష్టంగా మారడం ప్రారంభమైంది. మానవతా దృష్టితో సమస్యను పరిశీలించిన ప్రభుత్వం, మాటల్లో కాదు, చర్యల్లో పరిష్కారం చూపింది. సుమారు రూ.700 కోట్ల వ్యయంతో “ఉద్దానం సురక్షిత తాగునీటి పథకం” (Uddanam Safe Drinking Water Scheme)ను ప్రారంభించి, ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు చేపట్టింది. ఆధునిక ఫిల్టర్ ప్లాంట్లు, పైప్లైన్లు, నిల్వ ట్యాంకులు ఏర్పాటు చేసి, ప్రతి గ్రామానికీ నాణ్యమైన నీరు సరఫరా చేస్తోంది.
Uddanam’s Hidden Story | How @YSJagan’s Leadership Saved Lives
— YSR Congress Party (@YSRCParty) October 19, 2025
A Must Watch Documentary 🙌🏻🚨
ఉద్దానంలో ఏ ఇంటి తలుపుతట్టినా కన్నీటిచారలే.. గుండెలను పిండేసే కిడ్నీ బాధలే…
కానీ.. వైయస్ జగన్ గారు వచ్చాక ఐదేళ్లలోనే తన మంచి మనసుతో ఉద్దానం బతుకు చిత్రాన్ని మార్చేశారు
700 కోట్ల… pic.twitter.com/EpNmmNFZnQ
ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్
అంతేకాకుండా, రూ.85 కోట్ల వ్యయంతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ (Kidney Research Center) మరియు ప్రత్యేక ఆసుపత్రి (Hospital) నిర్మాణం చేపట్టింది. ఈ ఆసుపత్రి కిడ్నీ వ్యాధుల నిర్ధారణ, చికిత్స, పరిశోధనలకు కేంద్రంగా నిలుస్తోంది. ఇవి అన్నీ కలిపి, ఒకప్పుడు కడుపు నిండా బాధతో జీవించిన ఉద్దానం ప్రజలకు కొత్త ఆశను, కొత్త బతుకును అందించాయి. పిల్లలు ఇప్పుడు ఆరోగ్యంగా పెరుగుతున్నారు. “ఇక మన పిల్లలు మనలాంటి బాధలు చూడకూడదు” అనే నమ్మకం ఆ ప్రాంత ప్రజల్లో బలంగా రూపుదిద్దుకుంది.
వైసీపీ డాక్యుమెంటరీ – మార్పు ప్రతిధ్వని
ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీ (YSRCP Party) “ఉద్దానం మార్పు” (Uddanam Change)అనే డాక్యుమెంటరీ (Documentary)ని విడుదల చేసింది. ఈ వీడియోలో జగన్ ప్రభుత్వం ఉద్దానం ప్రజల కోసం చేపట్టిన చర్యలను చూపిస్తూ, “CBN, పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఈ ప్రాంతం కోసం ఏం చేశారు?” అని ప్రశ్నిస్తోంది. జగన్ తీసుకొచ్చిన పథకాలతో ఉద్దానం ప్రజల జీవితాల్లో చోటుచేసుకున్న మార్పులను ఈ డాక్యుమెంటరీ భావోద్వేగపూర్వకంగా చిత్రీకరించింది. ప్రజల కన్నీళ్లను తుడిచిన ప్రభుత్వ ప్రయత్నం ఈ ప్రాంత చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. ఉద్దానం మార్పు కేవలం డాక్యుమెంటరీ కాదు.. అది ఆ ప్రాంత ప్రజల ఆశలు, కష్టాలు, మార్పు ప్రతిబింబం. ఒకప్పుడు జీవితం కఠినమై కనిపించిన నేల, ఇప్పుడు జగన్ ప్రభుత్వం చూపించిన మార్పుతో స్వేచ్ఛగా జీవిస్తోంది.








