‘రీకాలింగ్ చంద్ర‌బాబు మేనిఫెస్టో’.. కూట‌మిపై వైసీపీ మ‌రోపోరు

'రీకాలింగ్ చంద్ర‌బాబు మేనిఫెస్టో'.. కూట‌మిపై వైసీపీ మ‌రోపోరు

కూట‌మి ప్ర‌భుత్వం (Alliance Government)పై వైసీపీ (YSRCP) మ‌రోపోరుకు (Another Battle సిద్ధ‌మైంది. చంద్ర‌బాబు (Chandrababu) నేతృత్వంలోని ప్ర‌భుత్వం ఏడాది పాల‌న (One Year Governance)ను పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా రీకాలింగ్ చంద్ర‌బాబు (Recalling Chandrababu) మేనిఫెస్టో (Manifesto) పేరుతో ఇంటింటికీ ప్ర‌చారం నిర్వ‌హించాల‌ని మాజీ ముఖ్య‌మంత్రి (Former Chief Minister) , వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ (YS Jagan) నిర్ణ‌యించారు. ఈ మేర‌కు బుధ‌వారం జ‌రిగిన పార్టీ నేత‌ల (Party Leaders) స‌మావేశం(Meeting)లో కార్య‌క్ర‌మ‌ కార్యాచ‌ర‌ణ‌ను వైఎస్ జ‌గ‌న్ వివ‌రించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లు హాజరయ్యారు.

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను (Election Promises) అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ, ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ (Recalling Chandrababu Manifesto) అనే కార్యక్రమ విధివిధానాల‌ను ప్ర‌క‌టించారు వైఎస్ జ‌గ‌న్‌. ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబు నాయుడు హామీలను, వాటి వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నట్లు వైఎస్ జ‌గ‌న్‌ తెలిపారు.

‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని ఐదు వారాలపాటు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి కూటమి ప్రభుత్వం వల్ల జరిగిన నష్టాన్ని, వైసీపీ ప్రభుత్వం ఉంటే లభించే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయనున్నారు. రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా చంద్రబాబు మేనిఫెస్టో హామీలు, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ బాండ్ల వివరాలను ప్రజలకు చూపిస్తారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే, ఒక్కో కుటుంబం ఎంత నష్టపోయిందో, గత ఏడాది ఎగ్గొట్టిన మొత్తం, ఈ ఏడాది రావాల్సిన మొత్తం వివరాలు అందుబాటులోకి వస్తాయి. ఈ కార్యక్రమం నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిలలో నాలుగు దశల్లో జరుగుతుంది, గ్రామ కమిటీలను కూడా ఇన్వాల్వ్ చేస్తారు.

“చంద్రబాబు ఎన్నికల హామీల రిబ్బన్ కూడా కట్ చేయకుండా, అన్నీ అమలు చేశామని చెబుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందం అంటున్నారు” అని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో సంవత్సర కాలంలోనే ప్రజల్లో ఏర్పడిన తీవ్ర వ్యతిరేకతను దాచడానికి చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌ (Diversion Politics)కు దిగుతున్నారని ఆరోపించారు. ఈ ఐదు వారాల కార్యక్రమంలో గ్రామ స్థాయిలో కమిటీల ఏర్పాటును కూడా పూర్తి చేయాలని వైఎస్ జ‌గ‌న్ నాయ‌కుల‌ను ఆదేశించారు. “చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలతో ఇంటింటికీ బాండ్లు పంచారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలు, సంతకాలతో ప్రజలను ఆకర్షించారు. కానీ ఒక్క రూపాయి కూడా అమలు కాలేదు” అని వైఎస్ జ‌గ‌న్ అన్నారు.

గత వైసీపీ ప్రభుత్వం వివక్ష లేకుండా పథకాలు అమలు చేసిందని, కానీ కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్‌ పాలనతో అన్యాయాలు, అణిచివేతకు పాల్పడుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు చంద్రబాబు మోసాలను వివరించడమే ప్రధాన లక్ష్యంగా వైసీపీ పెట్టుకుంది. ఈ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతను మరింత పెంచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment