పల్నాడు జిల్లా (Palnadu District) సత్తెనపల్లి (Sattenapalli) నియోజకవర్గంలోని రెంటపాళ్ల (Rentapalla) గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పర్యటన భారీ జన సందోహానికి వేదికైంది. ఉదయం 10 గంటలకు తాడేపల్లి (Tadepalli) నివాసం నుంచి బయల్దేరిన జగన్ 80 కిలోమీటర్ల దూరం ఉన్న రెంటపాళ్లకు చేరుకునేందుకు ఏకంగా 8 గంటల పాటు ప్రయాణించాల్సిన పరిస్థితి ఎదురైంది. సాయంత్రం 5 గంటలకు రెంటపాళ్ల చేరుకున్నారు. దారిపొడవునా వైసీపీ శ్రేణులు (YSRCP Cadres), అభిమానులు ఆయనను చూసేందుకు భారీగా తరలివచ్చారు. పోలీసుల ఆంక్షలను ఖాతరు చేయకుండా వైసీపీ శ్రేణులు జగన్ పర్యటనకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు (Police) కఠిన ఆంక్షలు (Strict Restrictions) విధించారు. 100 మందితో సహా కేవలం మూడు అదనపు వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పినప్పటికీ, వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పోలీసుల ఆంక్షలను సైతం బేఖాతరు చేశారు. సత్తెనపల్లి చుట్టూ 25 చెక్పోస్టులు, బారీకేడ్లతో రోడ్లు మూసివేసినా, కార్యకర్తలు పొలాల గట్ల వెంబడి కొత్త దారులు సృష్టించుకుని రెంటపాళ్ల చేరుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ పర్యటనలో పోలీసు ఆంక్షలు వైసీపీ శ్రేణుల్లో అసహనాన్ని రేకెత్తించి, జగన్ పట్ల అభిమానంతో మరింత జన సందోహాన్ని తెచ్చిపెట్టినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. టీడీపీ(TDP) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం (Coalition Government) జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోందని వైసీపీ శ్రేణులు ఆరోపించారు. రెంటపాళ్ల పర్యటన జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను మరోసారి చాటిందని వైసీపీ క్యాడర్ చెబుతోంది. ఎట్టకేలకు రెంటపాళ్లకు చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ నేత, ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు (Korlakunta Nagamalleswara Rao) విగ్రహాన్ని ఆవిష్కరించి, ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
విషాదం..
జగన్ పర్యటనలో విషాదం చోటుచేసుకుంది. జగన్ కాన్వాయ్లోని ఒక ప్రైవేట్ వాహనం (టాటా సఫారీ AP26CE0001) గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలో సింగయ్య (53) అనే వృద్ధుడిని ఢీకొట్టింది. గాయపడిన సింగయ్యను స్థానికులు గుంటూరు జనరల్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందారు. స్థానికుల ఆరోపణల ప్రకారం, వాహనం ఆగకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అదే విధంగా, సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద మరో వైసీపీ కార్యకర్త సొమ్మసిల్లి ఆస్పత్రికి తరలించేలోపు మృతిచెందారు.
గుంటూరు శివారు ఏటుకూరు రోడ్డుకు చేరుకున్న @ysjagan
— Telugu Feed (@Telugufeedsite) June 18, 2025
పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి ఎంటర్ అయిన జగన్
YCP ఇన్ఛార్జి బలసాని కిరణ్ ఆధ్వర్యంలో భారీగా జగన్ కు స్వాగతం పలికిన వైసీపీ క్యాడర్#AndhraPradesh #YSRCP #YSJagan pic.twitter.com/a2LQL6pIXi