గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్ మేనేజర్. క్రికెట్ బెట్టింగ్పై సమాచారం అందుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్ మేనేజర్ నీలేశ్ చోప్రాను అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఆర్ నగర్ తిరుమల హోమ్స్లోని నీలేశ్ చోప్రా నివాసంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న VIVO మొబైల్ని గుర్తించి సీజ్ చేశారు.
ఈ ఫాక్ట్స్ సరిపోతాయా అరెస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు కూడా కావాలా? https://t.co/jkYeE8eDeE pic.twitter.com/i0Yu9i4bkM
— Telugu Scribe (@TeluguScribe) February 6, 2025
జనవరి 31వ తేదీన మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఇంగ్లాండ్ VS ఇండియా టీ20 మ్యాచ్ జరిగింది. టీ20 మ్యాచ్ బెట్టింగ్ కోసం అతను “radheexch” వెబ్సైట్ను ఉపయోగించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. చట్టవిరుద్ధంగా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు నిందితుడి అంగీకరించడంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్ మేనేజర్ నీలేశ్ చోప్రాను అదుపులోకి తీసుకొని అతని స్టేట్మెంట్ రికార్డు చేసిన అనంతరం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ విషయాన్ని తెలుగు స్క్రైబ్ తన ఎక్స్లో (ట్విట్టర్)లో పేర్కొనగా, వైజయంతీ మూవీస్ ఎక్స్ హ్యాండిల్ ఈ వార్తను ఖండించే ప్రయత్నం చేయగా, తెలుగు స్కైబ్ ఎఫ్ఐఆర్ కాపీని విడుదల చేస్తూ మరో ట్వీట్ చేసింది.