విశాఖపట్నం (Visakhapatnam) లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. మధురవాడ (Madhurawada) ఆర్టీసీ కాలనీ (RTC Colony) లో 9 నెలల నిండు గర్భిణి అనూష (Anusha) ను భర్త (Husband) అమానుషంగా హత్య (Murder) చేశాడు. మరికొన్ని రోజుల్లో పండండి శిశువు (Healthy Baby)కు జన్మనివ్వాల్సిన గర్భిణి భర్త చేతుల్లో దారుణ హత్యకు గురైన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
జ్ఞానేశ్వర్-అనూష (Gnaneshwar- Anusha) దంపతులు రెండేళ్ల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత మధురవాడలోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. అనూష 9 నెలల గర్భిణీ (Pregnant). కాగా, గత కొంతకాలంగా భార్య అనూష, భర్త జ్ఞానేశ్వర్ మధ్య కలహాలు మొదలయ్యాయి. ఇటీవల తరచూ వీరి మధ్య గొడవలు (Arguments) జరుగుతున్నాయని తెలుస్తోంది. కాగా, ఆదివారం రాత్రి మరోసారి వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో ఆగ్రహావేశంతో భర్త జ్ఞానేశ్వర్ భర్యను గొంతు నులిమి (Strangled) హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు (Police) ఘటనా స్థలానికి చేరుకొని జ్ఞానేశ్వర్ను అదుపు (Custody)లోకి తీసుకోగా, చేసిన తప్పును అతడు అంగీకరించాడు.