విశాఖ‌లో దారుణం.. మ‌హిళ ప్రాణం తీసిన మ‌త్తు డాక్ట‌ర్‌!

విశాఖ‌లో దారుణం.. మ‌హిళ ప్రాణం తీసిన మ‌త్తు డాక్ట‌ర్‌!

విశాఖపట్నం జిల్లాలోని నీరుకొండలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెయ్యి ఫ్యాక్చర్ కారణంగా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ఓ మహిళకు అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆమె కోమాలోకి వెళ్లింది. చికిత్స పొందుతూ మృతిచెందింది. రెండు సార్లు అత్యధిక మోతాదులో ఇంజెక్షన్ ఇవ్వడమే ఈ విషాదానికి కారణమని తెలుస్తోంది.

బంధువుల ఆందోళన, ఉద్రిక్త వాతావరణం
ఈ ఘటనతో బాధిత మహిళ బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి యాజమాన్యంపై మండిప‌డుతూ ఆందోళనకు దిగారు. ఈ నిరసన తగరపువలస ప్రాంతం వరకు వ్యాపించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు కూడా ఈ ఘటనను ఖండిస్తూ బాధిత కుటుంబానికి మద్దతు తెలిపారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయం అందించాలని, ఆర్థిక పరిహారం, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అభిప్రాయపడుతున్నారు.

పోలీసుల చర్యలు
ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన డాక్టరును అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవల నాణ్యత, రోగుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థలు ఈ ఘటనను ఖండిస్తూ, ఆసుపత్రుల్లో కఠిన నియంత్రణలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment