బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium, Bengaluru) వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు (Stampede Incident) విరాట్ కోహ్లీ (Virat Kohli) కూడా బాధ్యత వహించాలని ఆరోపిస్తూ కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో (Cubbon Park Police Station) రియల్ ఫైటర్స్ ఫోరం(Real Fighters Forum) అధ్యక్షుడు హెచ్.ఎం. వెంకటేశ్ (President H.M. Venkatesh) ఫిర్యాదు దాఖలు చేశారు. కోహ్లీపై కేసు(Case) నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటన సంబంధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)(RCB) యాజమాన్యం, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) (KSCA), మరియు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ (Event Management Company DNA Entertainment)పై ఇప్పటికే మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అయితే, కోహ్లీపై దాఖలైన ఫిర్యాదుపై పోలీసులు ఇంకా ఎలాంటి చర్య తీసుకోలేదు.
ఈ తొక్కిసలాట ఘటనలో బాధ్యులపై చర్యలు కొనసాగుతున్నాయి. కర్ణాటక ఇంటెలిజెన్స్ చీఫ్ హేమంత్ నింబాల్కర్ (Karnataka Intelligence Chief Hemant Nimbalkar)తో సహా పలువురు పోలీసు అధికారులను బదిలీ చేశారు. ఘటనకు సంబంధించి అరెస్టయిన నలుగురిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు 41వ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు ఇచ్చింది. అరెస్టయినవారిలో ఆర్సీబీ మార్కెటింగ్ అండ్ రెవెన్యూ హెడ్ నిఖిల్ సోసాలే, డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్కు చెందిన సునీల్ మాథ్యూ (వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ అఫైర్స్), కిరణ్ కుమార్ (సీనియర్ ఈవెంట్ మేనేజర్), మరియు సుమంత్ (టికెటింగ్ ఆపరేషన్స్ లీడ్) ఉన్నారు.