రోజులు మారాయి.. చదువుల పద్ధతులు మారాయి. కానీ పిల్లల ప్రవర్తన మాత్రం ఊహలకందకుండా మారిపోతోంది. ఓటీటీలు, సోషల్ మీడియా ప్రభావం ఎటువంటి మార్పులు తెస్తుందో నాసిక్ (Nashik) లోని ఓ పాఠశాల ఘటన చూస్తే స్పష్టమవుతుంది. పదో తరగతి వరకు విద్యను అందిస్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ (Private School)లో, విద్యార్థుల బ్యాగులను (Students Bags) ర్యాండమ్గా చెక్ చేయాలన్న ఆలోచన ప్రిన్సిపల్కి వచ్చింది. మొదటిసారిగా చెకింగ్ ప్రారంభించినప్పటి నుంచే వరుసగా షాకింగ్ రిజల్ట్స్ (Shocking Results) కనిపించాయి. బ్యాగుల్లో చిన్నారుల వయసుకు సంబంధం లేని వస్తువులు బయటపడ్డాయి. బాగుల్లో కండోమ్స్ (Condoms), కత్తులు (Knives), ఇంకా కొన్ని సిగరెట్ లైటర్లు (Cigarette Lighters) వంటి వస్తువులు చూసి ప్రిన్సిపల్ (Principal) షాక్ అయ్యారు.
ఈ విషయాన్ని బయటపెట్టకుండా, విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా స్కూల్ యాజమాన్యం చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. తల్లిదండ్రులకు (Parents) సమాచారం ఇచ్చి వారి మద్దతుతో విద్యార్థులపై మానసికంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా కౌన్సెలింగ్ ప్రారంభించింది.
స్కూల్ యాజమాన్యం
ఈ తనిఖీలు పిల్లలను సరైన మార్గంలో నడిపించేందుకు, వారి ప్రవర్తనను సమీక్షించేందుకు భాగంగా మాత్రమే చేస్తున్నామని స్కూల్ ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. తల్లిదండ్రులు కూడా స్కూల్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో స్పందనలు ఊపందుకుంటున్నాయి. “ఇలాంటి చెకింగ్ అన్ని స్కూళ్లలో చేస్తే, పిల్లలపై ఓటీటీ (OTT) & సోషల్ మీడియా (Social Media) ప్రభావం ఎంత తీవ్రమైందో తెలుస్తుందేమో!” అంటూ నెటిజన్లు సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు.