విజయవాడ (Vijayawada)లో డ్రగ్స్ (Drugs) రాకెట్ (Racket)ను పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీ (Delhi) నుంచి నగరానికి తీసుకొచ్చిన 30 గ్రాముల మెథాంఫెటమిన్ (Methamphetamine) (మెథ్) డ్రగ్స్ను రామవరప్పాడు రింగ్ సెంటర్ (Ramavarappadu Ring Centre) వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి (Custody) తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు విద్యార్థి అని తెలుస్తోంది.
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు 2 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ డ్రగ్స్ను ఢిల్లీ (Delhi) నుంచి విజయవాడ (Vijayawada)కు తరలించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితులు ఈ డ్రగ్స్ను స్థానికంగా విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలను సేకరించే పనిలో చేస్తున్నారు. ఈ డ్రగ్స్ రాకెట్లో మరికొందరు పాల్గొని ఉండే అవకాశం ఉందని, వారిని పట్టుకునేందుకు ఆపరేషన్ను ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన నగరంలో డ్రగ్స్ వ్యాప్తిపై ఆందోళనలను మరింత పెంచింది.
100 రోజులైనా నిర్మూలన జరగలేదు
ఇటీవల రాష్ట్రంలో డ్రగ్స్ రవాణా విపరీతమైందని, రాష్ట్రంలో మొట్టమొదటిసారి మంగళగిరిలో కొకైన్ లభ్యమైంది. అదే విధంగా విశాఖపట్నంలోనూ ఈమధ్యకాలంలో విపరీతంగా డ్రగ్స్ పట్టుబడిన వార్తలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల్లో గంజాయి ఫ్రీ స్టేట్గా తీర్చిదిద్దుతామని ప్రకటించినప్పటికీ.. తాజాగా రాష్ట్రంలో విపరీతంగా మాదక ద్రవ్యాలు పట్టుబడడం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనపై దృష్టిపెట్టాలని కోరుతున్నారు.