తమిళ స్టార్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) తన 50వ చిత్రం ‘మహారాజా’ తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు, ఆయన ప్రధాన పాత్రలో పాండిరాజ్(Pandiraj) దర్శకత్వం వహించిన మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత నిత్యామీనన్(Nithya Menen) హీరోయిన్గా నటిస్తుండగా, యోగి బాబు, సెంబన్ వినోద్ జోస్, దీపా శంకర్, శరవణన్, రోషిణి హరిప్రియన్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పరోటా మాస్టర్గా స్పెషల్ ట్రైనింగ్
ఈ సినిమాలో విజయ్ సేతుపతి పరోటా మాస్టర్(Parotta Master)గా కనిపించనున్నాడు. పాత్రకు నిజమైన నైపుణ్యం అందించేందుకు, ఆయన పరోటా తయారీపై ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
విజయ్ సేతుపతి ప్రతి సినిమాకూ తనదైన మార్క్ పెట్టడం తెలిసిందే. ఈ కొత్త పాత్రలో ఆయన నటన, లుక్స్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.