టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు కూడా భారీగా హాజరుకావడంతో కార్యక్రమం తారల సందడితో కళకళలాడింది. ప్రస్తుతం రిసెప్షన్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.















