విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ టికెట్ రేట్లు పెంపు..

విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' టికెట్ రేట్లు పెంపు..

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన ‘కింగ్‌డమ్’ (‘Kingdom’) సినిమా (Movie) మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాను ఎట్టకేలకు ఈ నెల 31వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార నాగవంశీ (Sithara Naga Vamsi) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం జీవో (GO) జారీ చేసింది. ఈ జీవో ప్రకారం, ‘కింగ్‌డమ్’ సినిమా టికెట్లను సింగిల్ స్క్రీన్‌లలో జీఎస్టీతో కలిపి రూ. 50, మల్టీప్లెక్స్‌లలో జీఎస్టీతో కలిపి రూ. 75 పెంచి అమ్ముకోవడానికి అవకాశం కల్పించారు.

సినిమా విడుదలైన రోజు నుంచి పది రోజుల పాటు ఈ పెరిగిన టికెట్ రేట్లతో అమ్ముకునే అవకాశం ఉంటుంది. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌గా నటించింది. ‘కింగ్‌డమ్’ సినిమాకు సంబంధించి తెలంగాణలో కూడా టికెట్ రేట్స్ హైక్ అడిగే అవకాశం ఉంది.

విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ. 130 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. ఇప్పటికే ఓటీటీ రైట్స్ ద్వారా రూ. 50 కోట్లు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment