ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి జూపల్లి కృష్ణారావు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ధన్ఖడ్ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ఐసీఏఆర్-కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించనున్నారు. రైతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, వారి సమస్యలు, అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు.
కన్హా శాంతివనంలో బస
సాయంత్రం రైతులతో సమావేశం అనంతరం ఉపరాష్ట్రపతి గారు ఈ రాత్రికి కన్హా శాంతివనంలో బస చేస్తారు. రేపు ఉదయం ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. ఉపరాష్ట్రపతి తెలంగాణ పర్యటనలో భాగంగా వ్యవసాయం, రైతులతో జరిపే చర్చలు వారి సంక్షేమానికి కీలకంగా మారనున్నాయని తెలుస్తోంది.