అమానుషం.. కట్నం కోసం కోడలికి హెచ్ఐవీ ఇంజెక్షన్‌!

అమానుషం.. కట్నం కోసం కోడలికి హెచ్ఐవీ ఇంజెక్షన్‌!

అడిగినంత అదనపు కట్నం ఇవ్వలేదన్న కోపంతో న‌మ్మి వ‌చ్చిన కోడ‌ల్ను అత్తింటివారు అతికిరాత‌కంగా బ‌లిగొన్నారు. ఆమెకు బలవంతంగా హెచ్ఐవీ బాధితుడికి ఇచ్చే ఇంజెక్షన్ చేయించి ప్రాణం తీశారు. ఈ అమానుష ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రిగింది.

యూపీ సహరన్‌పూర్‌కు చెందిన యువతికి, ఉత్తరాఖండ్ హరిద్వార్‌కు చెందిన అభిషేక్ అలియాస్ సచిన్‌తో 2023 ఫిబ్రవరి 15న పెళ్లయింది. పెళ్లికి రూ.45 లక్షలు ఖర్చు చేసి, రూ.15 లక్షల కట్నంతో పాటు కారును బహుమతిగా ఇచ్చారు. అయితే, పెళ్లైన మరుసటి రోజే అత్తింటివారు మరో రూ.10 లక్షలు కట్నం కోసం వేధించడం ప్రారంభించారు. యువ‌తి తల్లిదండ్రులు అద‌న‌పు క‌ట్నం ఇచ్చేందుకు నిరాకరించడంతో, యువతిని ఇంట్లోంచి వెళ్లగొట్టారు. పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి, మళ్లీ అత్తింటికి పంపించారు. కానీ, మానసిక, శారీరక వేధింపులు మరింత పెరిగాయి. భర్తకు మరో వివాహం చేయాలనే ఉద్దేశంతో ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్నారు.

హెచ్ఐవీ ఇంజెక్షన్‌తో దారుణం
2024 మేలో, కోడలిని చంపేందుకు ఆమెకు హెచ్ఐవీ బాధితుడికి ఇచ్చే ఇంజెక్షన్ బలవంతంగా ఇచ్చారు. దీంతో ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి వెళ్లిన బాధితురాలు హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారించబడింది. అయితే, భర్తకు పరీక్షలు నిర్వహించగా అతడికి నెగటివ్ వచ్చింది. తండ్రి పోలీసులను ఆశ్రయించినా సరైన స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో బాధితురాలి భర్త, అత్త, మరిది, అతని భార్యపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment