న‌డిరోడ్డుపై త‌హ‌సీల్దార్ల వీరంగం.. రియ‌ల్ట‌ర్‌పై దాడి

న‌డిరోడ్డుపై త‌హ‌సీల్దార్ల వీరంగం.. రియ‌ల్ట‌ర్‌పై దాడి

ఆంధ్రప్రదేశ్‌లో చిత్తూరులో విచిత్ర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఎంతో బాధ్య‌త‌గా ఉండాల్సిన ఇద్ద‌రు మండ‌ల మేజిస్ట్రేట్ స్థాయి అధికారులు తప్పతాగి నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కృష్ణ కుమార్‌పై ఇద్ద‌రు త‌హ‌సీల్దార్లు దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది. గంగవరం, పెద్దపంజాణి ఇన్‌ఛార్జ్ తహసీల్దార్లుగా ఉన్న శివ, ప్రసన్న ఈ ఘటనకు పాల్ప‌డిన‌ట్లు స‌మాచారం.

వైరల్ అవుతున్న వీడియో
ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. బాధితుడు కృష్ణ కుమార్ మాట్లాడుతూ.. తనపై దాడి చేసిన ఎమ్మార్వోలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.శివ, ప్రసన్న, కృష్ణ కుమార్‌ల మధ్య ఆర్థిక లావాదేవీలున్నట్లుగా తెలుస్తోంది. రియ‌ల్ట‌ర్‌పై ఎమ్మార్వోల దాడి ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment