తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు భారీ షాక్

తెలంగాణలో (Telangana) ప్రజలకు మరోసారి రవాణా (Transport) భారం పెరిగింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) (TSRTC) బస్‌పాస్ (Bus Pass) ధరలను (Prices) భారీగా పెంచింది. పెరిగిన కొత్త ధరలు ఈరోజు (జూన్ 9, 2025) నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ధరల పెంపుతో సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులపై కూడా తీవ్ర ప్రభావం పడనుంది. ఆర్టీసీ(RTC) తీసుకున్న ఈ తాజా నిర్ణయం ప్రకారం, పాస్ ఛార్జీలు సగటున 20 శాతం లేదా అంతకంటే ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తోంది.

కొత్తగా పెరిగిన పాస్ ఛార్జీలు..
గతంలో రూ. 1,150 ఉన్న ఆర్డినరీ పాస్ ధర ఇప్పుడు రూ. 1,400కి పెరిగింది. రూ. 1,300గా ఉన్న మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ ధర ప్రస్తుతం రూ. 1,600కి చేరింది. అలాగే రూ. 1,450గా ఉన్న మెట్రో డీలక్స్ పాస్ ధర ఇప్పుడు రూ. 1,800గా అమలులోకి వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad), గ్రీన్ మెట్రో ఏసీ పాస్‌ల (Green Metro AC Passes) ధరలు కూడా గణనీయంగా పెరిగినట్లు అధికారిక వర్గాల నుంచి సమాచారం.

ఈ పెంపుతో సామాన్య ప్రజానీకానికి రవాణా ఖర్చులు మరింత అధికమవుతాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, రోజూ బస్సుల్లో ప్రయాణించే వారు ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్నారు. ఈ ధరల పెంపుపై ప్రభుత్వం నుంచి మరింత స్పష్టమైన వివరణ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment