హైదరాబాద్ (Hyderabad) ను సందర్శించేందుకు వచ్చిన ఓ కుటుంబానికి విషాదకర ఘటన ఎదురైంది. జ్ఞాపకం కావాల్సిన రైలు ప్రయాణం భయానక అనుభవంగా మారింది. ట్రైన్ వాష్రూమ్ (Train Washroom) లో మైనర్ బాలిక (Minor Girl)పై 25 ఏళ్ల యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secunderabad Railway Station) పరిధిలో సంచలనం రేపుతోంది. ఒడిశా (Odisha) లోని రక్సెల్ నుంచి సికింద్రాబాద్కు వచ్చిన ఎక్స్ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో బాలిక ఒంటరిగా వాష్రూమ్కు వెళ్లినప్పుడు, ఒక దుండగుడు ఆమెను ఫాలో అయ్యాడు. ఆ వాష్రూమ్లోనే బాలికపై లైంగిక వేధింపులకు (Sexual Harassment) పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని తన మొబైల్లో వీడియో రూపంలో కూడా రికార్డ్ చేసినట్లు సమాచారం.
బాలిక భయంతో బయటకు వచ్చి తండ్రికి చెప్పడంతో వెంటనే కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు చర్యలందుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నట్లు గుర్తించారు.
న్యాయం కోసం పోరాటం మొదలైంది
ఈ సంఘటనపై పీఎస్ఈ అట్రాసిటీ చట్టంతో పాటు ఫోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలికి మెడికల్ పరీక్షలు నిర్వహించారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ ఘటన ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో చిన్నారుల భద్రతపై పెద్దగా చర్చ జరుగుతుంది. పిల్లలకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో తల్లిదండ్రులు సైతం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.