త్వరలో టాలీవుడ్ కీలక సమావేశం

త్వరలో టాలీవుడ్ కీలక సమావేశం

ఓటీటీల (OTT Platforms) ప్ర‌భావం సినిమా థియేట‌ర్లపై (Theatres) ప‌డింది. దీంతో టాకీస్‌ల‌లో సినిమాలు చూసేవారి సంఖ్య రోజురోజుకీ త‌గ్గిపోతోంది. దీంతో ఎగ్జిబిట‌ర్లు (Exhibitors), డిస్టిబ్యూట‌ర్లు (Distributors), నిర్మాత‌ల‌కు (Producers) కూడా ఈ స‌మ‌స్య త‌ల‌నొప్పిగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) థియేటర్లలో పర్సంటేజీ విధానం లెక్కన సినిమాలాడించాలా లేక రెంటల్ విధానం లెక్కన ఆడించాలా అనే విషయం మీద కొన్ని ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్లందరూ క‌చ్చితంగా పర్సంటేజీ విధానంలోనే సినిమాలు ఆడించాలని లేదంటే థియేటర్లో మూసేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు అయింది.

ఈ కమిటీలో సభ్యులుగా కేఎల్ దామోదర ప్రసాద్, దిల్ రాజు, ప్రసన్నకుమార్, సి కళ్యాణ్, రవికిషోర్, రవిశంకర్, నాగవంశీ, దానయ్య, స్వప్న, సుప్రియ ఉన్నారు. వీరు నిర్మాతలు కాగా డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ నుంచి భరత్ భూషణ్, సుధాకర్ రెడ్డి, శిరీష్ రెడ్డి, మైత్రి శశి, ఎల్విఆర్, ముత్యాల రామదాసు, నాగార్జున, సీడెడ్ కుమార్, భరత్ చౌదరి వంటి వారు ఉన్నారు.

ఎగ్జిబిటర్ సెక్టర్ నుంచి రాంప్రసాద్, దగ్గుబాటి సురేష్ బాబు, సునీల్ నారంగ్ సహా మొత్తం పదిమంది ఉన్నారు. ఏకంగా 30 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీ ఈనెల 29వ తేదీన హైదరాబాద్ తెలుగు ఫిలిం ఛాంబర్ హాల్ లో సమావేశం కాబోతోంది. ప్రధాన సమస్యలతో పాటు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఈ మీటింగ్ (Meeting) లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ప్రధాన అజెండా మాత్రం ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్న పర్సంటేజీ విధానం మీదే జరగబోతోంది. చూడాలి ఏం జరగబోతోంది అనేది.

Join WhatsApp

Join Now

Leave a Comment