“ది రాజాసాబ్” టికెట్ రేట్లతో నాకు సంబంధం లేదు: కోమటిరెడ్డి

“ది రాజాసాబ్” టికెట్ రేట్లతో నాకు సంబంధం లేదు: కోమటిరెడ్డి

చాలా రోజుల తర్వాత రెస్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) ను వెండితెరపై చూడాలనుకున్న అభిమానులు ఎగబడ్డారు. అయితే సినిమా టికెట్ ధరల (Movie Ticket Price Hike) పెంపు ఇబ్బందులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణలో సినిమా ధరలపై గవర్నమెంట్ ఆర్డర్ విడుదల ఆలస్యంగా జరిగింది. అన్ని అడ్డంకులను దాటిన తర్వాత శుక్రవారం తెల్లవారుజామున 12 తర్వాత “ది రాజాసాబ్” (The Raja Saab) ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. అభిమానులు సినిమాకు సంబంధించిన టికెట్ల కోసం ఎదురుచూస్తూ గడిపిన ఆతృత, ఈ షోల ప్రారంభంతో సంతృప్తి చెందింది.

అయితే, ఈ పరిణామంలో కొత్త ట్విస్ట్ వచ్చేది ఏమిటంటే.. తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ప్రభుత్వం జారీ చేసిన టికెట్ ధరల పెంపుని అనుమతించే ఆర్డర్‌ను రద్దు చేసింది. న్యాయవాది విజయ్ గోపాల్ (Advocate Vijay Gopal) దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ చేసిన కోర్టు, ప్రభుత్వ అనుమతులు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చినట్లు, ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ప్రశ్నించినది, “మీరు ఇలాంటి మెమోలు ఎందుకు ఇస్తున్నారు?” అని. మంత్రులు స్వయంగా ధరలు పెంచబోమని చెబుతున్నప్పటికీ వెనుక నుంచి ఇలాంటి మెమోలు రావడం పై కోర్టు అసహనంగా ఉంది.

సినిమా ఇండస్ట్రీ వ్యవహారాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ ధరల పెంపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పుష్ప-2, అఖండ 2 సినిమా విడుదల సమయంలో కూడా ఇలాగే పరిస్థితి ఎదురవుతుందని, కానీ పెరిగిన ధరలకు ఆయనకి సంబంధం లేదని మంత్రి చెప్పారు. అలాగే పుష్ప-2 విడుదల సమయంలో ఒక మహిళ మృతి చెందడం వంటి ఘటనపై మంత్రి తీవ్రంగా స్పందించి, బాధితులకు తన సొంత ఖర్చుతో చికిత్స అందించినట్లు తెలిపారు. పుష్ప-2 తర్వాత సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశా. టికెట్ రేట్లకు, బెనిఫిట్ షోలకు కూడా నిర్మాతలు నా దగ్గరికి రావట్లేదని మంత్రి తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment