రాజస్థాన్లోని కోర్పుత్లీ జిల్లాలో జరిగిన ఈ విషాదకర ఘటన అందరి మనసును కలిచివేసింది. 3ఏళ్ల చిన్నారి ఓ బోరుబావిలో 70 గంటల క్రితం పడిపోయింది. బావి మొత్తం 700 అడుగుల లోతు ఉండగా, బాలిక ప్రస్తుతం 150 అడుగుల లోతులో చిక్కుకుపోయినట్లు అధికారులు గుర్తించారు.
మూడు రోజులుగా సహాయక చర్యలు నిరంతరంగా కొనసాగుతుండగా, రాట్ హోల్ మైనింగ్ ద్వారా బాలికను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. బావిలోకి పైపుల ద్వారా ఆక్సిజన్ పంపుతున్నామని, ఆమె ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
దేశం అంతా ప్రార్థనలు
చిన్నారి క్షేమంగా బయటపడాలని దేశమంతా ఆందోళన వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలోనూ చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు. సహాయక బృందాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, ఈ సంఘటనకు స్పందించిన ప్రతి ఒక్కరూ ఆమె ప్రాణాలకు ముప్పు లేకుండా కాపాడాలని ఆశిస్తున్నారు.