భారత నాటక రంగానికి ఎనలేని సేవలందించిన ప్రఖ్యాత (Famous) థియేటర్ (Theatre) డైరెక్టర్ (Director) రాజేంద్రనాథ్ (Rajendra Nath) ఇకలేరు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఆయన ఢిల్లీ (Delhi)లోని తన నివాసంలో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. థియేటర్ కళను సామాజిక మార్పు సాధనంగా మార్చిన ఆయన, దేశవ్యాప్తంగా అనేక విద్యార్థులు, నాటక ప్రేమికులకు ప్రేరణగా నిలిచారు.
శ్రీరామ్ సెంటర్కి తొలి డైరెక్టర్గా అరుదైన సేవలు
రాజేంద్రనాథ్, ఢిల్లీ కేంద్రంగా పనిచేసే ప్రముఖ కళాసంస్థ శ్రీరామ్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చర్కి (Sriram Center for Art & Culture) తొలి డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. హిందీతోపాటు పంజాబీ, ఉర్దూ, కన్నడ, బెంగాలీ వంటి అనేక భారతీయ భాషలలో నాటకాలను రూపొందించి, నాటక రంగాన్ని ప్రాంతీయ సరిహద్దుల వరకే పరిమితం కాకుండా చేశారు. ఆయన రూపొందించిన పలు నాటకాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి.
ఆరోగ్య సమస్యలతో..
గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజేంద్రనాథ్ ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించింది. గత పది రోజులుగా ఆయన పరిస్థితి మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు దగ్గరుండి చికిత్స అందించారు. అయితే, ఈరోజు ఉదయం ఆయన కన్నుమూశారు. ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.








