తెలంగాణలో గ్రూప్-2 ఫలితాలు విడుదల

తెలంగాణలో గ్రూప్-2 ఫలితాలు విడుదల

తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష (Group-2 Exam) ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ (TGPSC) చైర్మన్ బుర్రా వెంకటేశం ఫలితాలను అధికారికంగా విడుద‌ల చేశారు. అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తో పాటు ఫైనల్ కీ (Final Key)ని కూడా విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఓఎంఆర్ షీట్స్ (OMR Sheets)ను టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

783 గ్రూప్-2 పోస్టుల భర్తీకి 2022లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, డిసెంబర్ 15, 16 తేదీలలో నిర్వహించిన పరీక్షకు 2.49 లక్షల మంది మాత్రమే హాజరయ్యారు. ఇందులో 2.36 లక్షల మంది అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో టాపర్ 447 మార్కులు సాధించడం విశేషం.

ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్ ప్రభుత్వ ప్రణాళిక
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. సోమవారం గ్రూప్-1 ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వం, ఇవాళ గ్రూప్-2 ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెల 14న గ్రూప్-3 ఫలితాలు, 20న హస్టల్ వెల్ఫేర్ ఫలితాలను ప్రకటించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను త్వరితగతిన భర్తీ చేయాలనే లక్ష్యంతో నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఆర్థిక శాఖ ఆమోదం పొందిన మరికొన్ని పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. రాబోయే నోటిఫికేషన్ల కోసం టీజీపీఎస్సీ సహా పలు బోర్డులకు ఇప్పటికే సూచనలు పంపినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment