గుంటూరు జిల్లా (Guntur District) తెనాలి(Tenali)లోని పరిమి డొంక(Parimi Donka)లో ఇద్దరు వృద్ధ మహిళలు (Two Elderly Women)దారుణ హత్య(Brutally Murdered)కు గురైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. దోపిడీ దొంగల చేతిలో ఇద్దరు వృద్ధులు తీవ్రగాయాలతో మృతిచెందిన సంఘటన చుట్టుపక్కల నివాసితులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. దోపిడీ దొంగల చేతిలో తెనాలిలోని విజయపురం (Vijayapuram)నివాసులైన దాసరి రాజేశ్వరి (Dasari Rajeshwari) (65), పెట అంజమ్మ (Peta Anjamma)(70) మృతిచెందినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈరోజు ఉదయం 11:30 గంటల సమయంలో ఒక మహిళ వృద్ధుల ఇంటి తలుపు తట్టింది. తలుపు తెరవగానే ఆమెతో పాటు ఇద్దరు పురుషులు లోపలకు ప్రవేశించారు. కేవలం 10 నిమిషాల పాటు ఇంటిలో ఉన్న ముగ్గురు, అనంతరం ఆటోలో అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సమయంలో వృద్ధ మహిళలు గట్టిగా కేకలు వేసినట్లు స్థానికులు తెలిపారు. హత్య సమయంలో ఇంటిలోని బంగారం అపహరణకు గురైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలంలో తలపై తీవ్ర గాయాలతో మృతదేహాలను గుర్తించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీలు, స్థానికుల సమాచారం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు ముగ్గురు అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమీపంలోని ఆటో స్టాండ్లలో విచారణ జరుపుతూ, సంఘటనా స్థలం చుట్టూ ఉన్న సీసీటీవీ కెమెరాల ద్వారా నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ హత్యలు బంగారం దోపిడీ కోసం జరిగాయా లేక వ్యక్తిగత కక్షలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. స్థానికులు ఈ ఘటనతో భయాందోళనలో ఉన్నారు. పోలీసులు త్వరలో నిందితులను పట్టుకుంటామని, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.