తెలంగాణ (Telangana) లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. మొక్కులు తీర్చుకునేందుకు దేవాలయానికి (Temple) వెళ్లిన ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లాలో కలకలం రేపుతోంది. మహబూబ్నగర్ (Mahbubnagar) కు చెందిన ఓ యువతి తన బంధువుతో కలిసి శనివారం ఊర్కొండ మండలం ఊర్కొండపేట (Urkondapet) లోని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లింది. అనంతరం కాలకృత్యాల కోసం సమీపంలోని గుట్ట ప్రాంతానికి వెళ్లిన ఆమెపై కొందరు కామాంధులు దాడి చేశారు. మొదట ఆమె బంధువును పరామర్శించి, అనంతరం యువతిపై లైంగిక దాడికి (Sexual Assault) పాలపడ్డారు.
ఆరుగురు నిందితుల అరెస్ట్
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురిని (Six People) అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల వెల్లడించారు.