కాకినాడ నుంచి ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం

కాకినాడ నుంచి ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం

తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఇవాళ కాకినాడ పోర్టు (Kakinada Port) లో పర్యటించనున్నారు. తెలంగాణ సర్కారు ఫిలిప్పీన్స్‌ (Philippines) కు బియ్యం (Rice) ఎగుమతికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, మొత్తం 8 లక్షల టన్నుల ఎంటీయూ 1010 రకం ముడి బియ్యాన్ని ఫిలిప్పీన్స్‌కు పంపనున్నారు.

ఈ ఒప్పందం అమల్లో భాగంగా, తొలి విడతగా 12,500 టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి షిప్ (Ship) ద్వారా రవాణా చేయనున్నారు. ఈ రోజు ఆ షిప్ బయలుదేరనుండగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ఈ ఎగుమతిని అధికారికంగా ప్రారంభించనున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment