తెలంగాణలో 2,722 కి.మీ హైవేల నిర్మాణం పూర్తి.. కేంద్రం కీలక ప్రకటన

తెలంగాణలో 2,722 కి.మీ హైవేల నిర్మాణం పూర్తి.. కేంద్రం కీలక ప్రకటన

తెలంగాణలో గత 10 సంవత్సరాలలో 2,722 కి.మీ మేర జాతీయ రహదారుల (NH) నిర్మాణం పూర్తయినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇది రాష్ట్ర రహదారుల అభివృద్ధిలో కీలక మ‌లుపు అని ఆయ‌న చెప్పారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నలకు లోక్ సభలో సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, రాష్ట్రంలో ప్రస్తుతం 30 జాతీయ రహదారులు (NHs) 4,926 కి.మీ పొడవున‌ విస్తరించాయని చెప్పారు.

అదే సమయంలో హైదరాబాద్‌లో టన్నెల్ రోడ్ల నిర్మాణం కోసం జాతీయ రహదారులకు లింక్ చేసే ప్రత్యేక నిధులపై ఎలాంటి ప్రతిపాదనలూ లేదని ఆయన స్పష్టం చేశారు. జాతీయ రహదారుల విస్తరణ మరింత జరుగుతుందని ఆయన తెలిపారు. రాజధానిపై అభివృద్ధి సంబంధిత ప్రాజెక్టులకు సంబంధించి గడ్కరీ స్పష్టత ఇచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment