గోదావరి-బనకచర్ల : ఏపీకి తెలంగాణ‌ స్ట్రాంగ్ రిప్ల‌య్‌

గోదావరి-బనకచర్ల : ఏపీకి తెలంగాణ‌ స్ట్రాంగ్ రిప్ల‌య్‌

హైదరాబాద్‌ (Hyderabad)లోని సచివాలయం (Secretariat)లో జరిగిన తెలంగాణ (Telangana) ఎంపీల (MPs’) అఖిలపక్ష సమావేశం (All-Party Meeting)లో గోదావరి-బనకచర్ల (Godavari-Banakacharla) అనుసంధాన ప్రాజెక్టు (Project)పై తీవ్ర చర్చ జరిగింది. ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy), నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ఆధ్వర్యంలో జరిగిన ఈ అఖిల‌ప‌క్ష‌ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ రావు, బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు. మంత్రి ఉత్తమ్ ఈ ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిన ప్రి-ఫీజిబిలిటీ నివేదికను వివరించారు.

ఈ ప్రాజెక్టు గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు (1980), ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (2014)ను ఉల్లంఘిస్తుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. ఏపీ ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను పెన్నా బేసిన్‌కు తరలించి, 7.41 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని యోచిస్తోందని, ఇది తెలంగాణ నీటి హక్కులకు భంగం కలిగిస్తుందని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.

ఏపీ ప్రభుత్వం (AP Government) బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) ద్వారా 300 టీఎంసీల (TMCs) గోదావరి జలాలను (Godavari Waters) వినియోగించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అయితే.. పోలవరం -బనకచర్ల (Polavaram – Banakacharla)ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామ‌ని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం -బనకచర్లను తిరస్కరించాలని కేంద్రానికి స్పష్టంగా చెప్పామ‌ని, గోదావరి ట్రైబ్యునల్ అవార్డును బనకచర్ల ప్రాజెక్టు ఉల్లంఘిస్తోందన్నారు. తెలంగాణకు అనుకూలమైన ఇచ్ఛంపల్లిని ఏపీ వ్యతిరేకించిందని, ఏపీ ప్రభుత్వ చర్యలు గోదావరి అవార్డుకు వ్యతిరేకమ‌న్నారు. తెలంగాణ వాటా 968 టీఎంసీలతో చేపట్టే ప్రాజెక్టులను ఏపీ వ్యతిరేకించిందని గుర్తుచేశారు. బనకచర్ల వల్ల తెలంగాణ వాటా జలాలకు భవిష్యత్ లో ఎదురుదెబ్బ త‌గులుతుంద‌న్నారు. పోలవరం – బనకచర్ల విషయంలో ఏపీ విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తూ, రాజకీయ, సాంకేతిక, న్యాయపరమైన పోరాటానికి సిద్ధమైంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జనవరి 22న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ (CR Patil)కు లేఖ (Letter) రాసి, ఈ ప్రాజెక్టు గోదావరి ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘిస్తుందని, ఏపీ విభజన చట్టం (AP Reorganization Act) నిబంధనలకు విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు. సమావేశంలో ఏపీ చర్యలు తెలంగాణ రైతుల ప్రయోజనాలకు హాని కలిగిస్తాయని, రాజకీయాలకు అతీతంగా రైతుల హక్కుల కోసం ఈ పోరాటం సాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ఉద్ఘాటించారు. అయితే, సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీలు మధ్యలోనే వాకౌట్ చేసి, గతంలో తమ ప్రభుత్వ నిర్ణయాల వల్ల అన్యాయం జరిగిందన్న ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. తెలంగాణ హక్కులను కాపాడేందుకు అఖిలపక్ష ఎంపీలు కలిసి నడవాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment