ఎమ్మెల్సీ (MLC) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్(KCR)కు రాసిన లేఖ (Letter) బహిర్గతమైనప్పటి నుంచి తెలంగాణ రాజకీయ వ్యవహారాలు హీటెక్కాయి. ఈ నేపథ్యంలో కవిత మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ జాగృతి సంస్థ (Telangana Jagruthi Organization) కొత్త కార్యాలయాన్ని (New Office) ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందిరా పార్క్ (Indira Park) వద్ద ఇప్పటివరకు పనిచేస్తున్న తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని మూసివేయనున్నారు.
ఈ రోజు సాయంత్రం 4:00 గంటలకు బంజారాహిల్స్ (Banjara Hills)లోని తన నివాసం పక్కన ఉన్న భవనంలో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూజా కార్యక్రమం అనంతరం కవిత, తెలంగాణ జాగృతి తరఫున కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులపై, అలాగే జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న ధర్నాపై కొత్త కార్యాలయంలో మాట్లాడనున్నారు.
కేసీఆర్కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాలు రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ బలోపేతానికి దోహదపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొత్త కార్యాలయ ప్రారంభం ద్వారా తెలంగాణ జాగృతి సంస్థ కార్యకలాపాలు మరింత ఊపందుకునే అవకాశం ఉంది.